వికారాబాద్ విద్యార్థినికి నాట్య రవళి అవార్డు

Published: Monday March 15, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 14 ( ప్రజా పాలన ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబిసి ఫౌండేషన్, వాసవి ఫిలిం అవార్డ్స్ వారి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలలో శ్రీ అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శాంతుకుమార్ కూతురు విద్యశ్రీ కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి నాట్య రవళి అవార్డు రావడం ఆమె కృషికి తగిన ఫలితం దక్కిందని తండ్రి శాంతుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలోని సరస్వతీ స్కూల్ ఆఫ్ డాన్స్ మాస్టర్ సరస్వతి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యంలో నైపుణ్యాన్ని సాధించిందని పేర్కొన్నారు.