న్యాయం చేయాలని ఎంపీడీవో కు వినతి
Published: Tuesday May 18, 2021
రాయికల్, మే 17, (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామపంచాయతిలో కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న కొండూరి రాజేష్ అనే వ్యక్తి యొక్క మొదటి భార్య ఘర్షకుర్తి రజని తనకు న్యాయం చేయాలని సోమవారం ఎంపీడీవో రమేష్ కు వినతి పత్రం సమర్పించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజేష్ కు నాకు 2018వ సంవత్సరం లో వివాహం జరిగిందని తమకు బాబు కూడా ఉన్నాడని కానీ అప్పటినుండి అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని ఇటీవలే రాయికల్ పట్టణానికి చెందిన పెండెం మానసను రెండో పెళ్లి చేసుకున్నాడని వీరిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామని మీరు కూడా మాకు న్యాయం చేయాలని వినతిపత్రం లో పేర్కొంది.
Share this on your social network: