పేదల పాలిట ఆపన్నహస్తం సీఎం సహాయనిధి కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్

Published: Wednesday June 16, 2021
మేడిపల్లి, జూన్ 15, (ప్రజాపాలన ప్రతినిధి) : సీఎం సహాయనిధి పేదల పాలిట వరంలాంటిదని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ పేర్కొన్నారు. డివిజన్ శంకర్ నగర్లో నివాసం ఉంటున్న యాదగిరి కుమారుడు విశ్వ ఆనంద్ గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రైవేటు ఉద్యోగి అయిన యాదగిరికి కుమారుని వైద్యం తలకు మించిన భారంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్  బండి రమ్య సతీష్ గౌడ్ కార్మిక మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విశ్వ ఆనంద్ గుండె వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,50,000 మంజూరు చేయించారు. మంజూరైన చెక్కును కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ రోగి బంధువులకు అందజేశారు. కుమారుని వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుండి సహాయం అందేలా కృషిచేసిన కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ కు యాదగిరి కృతజ్ఞతలు తెలియజేశారు.