మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ప్రధమ వర్ధంతి సభను జయప్రదం చేయండి : సిపిఐ జిల్లా కార్యదర్శి కలే

Published: Wednesday October 13, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : ప్రతినిత్యం ప్రజల కోసం పని చేసి తన తుది శ్వాస వరకు కార్మిక వర్గానికి ,పేద ప్రజానీకం తరపున పనిచేసిన అమరుడు కామ్రేడ్ గుండా మల్లేష్ (మాజీ ఎమ్మెల్యే) ప్రధమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కలవేన శంకర్ అన్నారు. మంగళవారం నాడు స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కామ్రేడ్ గుండా మల్లేష్  మొదటి వర్ధంతి సభను అక్టోబర్ 24 వ తేదీన స్థానిక  2 వ గ్రౌండ్ లో జరిగే సభను మరియు రామ టాకీస్ ముందు ఏర్పాటు చేస్తున్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి పార్టీ శ్రేణులు, అభిమానులు కృషి చేయాలని కోరారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విజయవాడలో జరిగే రాష్ట్ర మహ సభల కోసం పట్టణ, మండల, మహ సభలు మరియు జిల్లా మహ సభలను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని, బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ముసాయిదా ను పరిషత్తు ఆమోదించిన నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 6 వ తేదీ (అంబేడ్కర్ వర్ధంతి)వరకు మతవాద శక్తుల నుండి రాజ్యాంగ రక్షణ కోసం పలు కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు, కార్మిక, వ్యతిరేక విధానాలను తీసుకు వచ్చిన చట్టాలను నిరసిస్తూ వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సి పి ఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు చిప్ప నరసయ్య, రామడుగు లక్ష్మణ్, మేకల దాస్, జోగుల మల్లయ్య, బొల్లం పూర్ణిమ, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి  రెగుంట చంద్ర శేఖర్, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, దాగం మల్లేష్, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.