డ్వాక్రా మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ

Published: Wednesday October 06, 2021
బాలాపూర్: అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : మహిళకు బతకమ్మ ఉత్సాహాలు ప్రతి ఒక్కరు జరుపుకోవాలని స్థానిక కార్పొరేటర్ మద్ది సబిత రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 20వ డివిజన్ లో బతుకమ్మ చీరలు న్యూ గాయత్రీ నగర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లో పంపిణీ చేశారు. స్థానిక కార్పొరేటర్ మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..... బతుకమ్మ ఉత్సవాలు ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు స్వప్న, మద్ది రాజశేఖర్ రెడ్డి బిజెపి అధికార ప్రతినిధి రంగారెడ్డి జిల్లా బీజేపీ రజిని, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.