అన్ని దానాల కంటే రక్తదానం మహా గొప్పదిజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్

Published: Monday August 29, 2022

మధిర ఆగస్టు 28 ప్రజాపాలన ప్రతినిధి  అన్ని దానాల కంటే రక్తదానం మహా గొప్పదని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు కొరకు ఆదివారం స్థానిక టివిఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేసిన వారిని అభినందించి వారికి పండ్లు జ్యూస్ అందజేశారు. అనంతరం మధిర సిమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి అధ్యక్షులు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయటం వల్ల ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగి గాయపడిన వారికి సకాలంలో రక్తం కావలసి ఉంటుందని అటువంటి వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన సామాజిక, సేవా సంస్థలకు సూచించారు. ఈ రక్తదాన శిబిరంలో 41 మంది సిమ్మర్స్ సభ్యులు పాల్గొని రక్తదానం చేయడం పట్ల ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సిమ్మర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పల్లబోతుల ప్రసాదరావు, జింకల కోటేశ్వరావు, చల్లా సత్యనారాయణ సహాయ కార్యదర్శి మైనీడి పూర్ణచంద్రరావు ప్రచార కార్యదర్శిలు లింగంపల్లి అప్పారావు ధార సుధాకర్ అబ్దుల్ సభీరా, మార్తా శ్రీనివాసరావు, డాక్టర్ వాసిరెడ్డి సతీష్, ఆదూరి అబ్రహం, గుర్రాల శ్రీనివాస రెడ్డి, కటకం రాంబాబు, కర్లపూడి వాసు, ఊట్కూరి భాస్కరరావు, కొలగాని ప్రసాద్, వేలవేల శ్రీధర్, కుంచం కృష్ణారావు, కోమటీడి శ్రీనివాసరావు, వైవి అప్పారావు, కోన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.