ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ వో సి అందచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published: Saturday May 15, 2021
గుమ్మడిదల, మే 14, ప్రజాపాలన ప్రతినిధి : నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన శిరీష గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కింద దరఖాస్తు చేసుకోగా 80 వేల రూపాయల ఎల్ వో సి మంజూరైంది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శిరీష కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎల్ వో సి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ మాజీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: