షర్మిల సభను విజయవంతం చేయాలి కొండ : రాఘవ రెడ్డి, శీలం. వెంకటరెడ్డి

Published: Monday April 05, 2021

మధిర ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మంలో ఏప్రిల్ 9న జరిగే షర్మిల సభను విజయవంతం చేయాలని షర్మిల పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కొండా రాఘవరెడ్డి, బండారు అంజన రాజు, కోరారు. ఆదివారం మధిర భరత్ విద్యాసంస్థల్లో శీలం వెంకట రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే షర్మిల నూతనంగా ఏర్పాటు చేయబోయేపార్టీద్వారానేసాధ్యమవుతుందన్నారు. రాజన్న రాజ్యం రావాలని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఈ సందర్భంగా వారు తెలిపారు. షర్మిల నూతనంగా ఏర్పాటు చేయబోయే పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధ్యమవుతుందన్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మం పెలియన్ గ్రౌండ్లో  షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వైఎస్ఆర్ అభిమానులు భారీ స్థాయిలో తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో షర్మిల పార్టీ నాయకులు శీలం. వెంకట రెడ్డి,ఎస్. నాగేశ్వరరావు, శీలం చెన్నారెడ్డి, ఐదు మండలాల అధ్యక్షులు సామినేని రవి, వాకా వీరారెడ్డి, మౌలాలి అయిలూరి ఉమా మహేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మద్దెల ప్రసాదరావు, మస్తాన్ పాషా, దేవంబోట్ల శ్రీనివాసరావు, కొప్పుల శ్రీనివాస్ రావు, మస్తాన్, విష్ణు, కోనా.మధు, సతీష్, మురహరి, తదితరులు పాల్గొన్నారు