భారీ వర్షాలకు జోగన్ పల్లి లోని పోతన్న గారి గుంటకు గండి
Published: Tuesday July 12, 2022
కోరుట్ల, జూలై 11 ( ప్రజాపాలన ప్రతినిధి ):
గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కోరుట్ల మండలం లోని జోగన్ పల్లి గ్రామంలోని పోతన్న గారి కుంటలో నీటి నిల్వ పెరిగి గండి ఏర్పడింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య వెంటనే స్పందించి సంబధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి కుంటవద్ద పడిన గండిని పరిశీలించారు.అధికారుల సలహాలతో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య తెలిపారు.
Share this on your social network: