కేటీఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు రేషన్ కిట్లు పంపిణీ

Published: Thursday June 10, 2021
మేడిపల్లి, జూన్ 9 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా విపత్తులో లాక్ డౌన్ సందర్భంగా పేద ప్రజలను ఆదుకోవాలని ఉద్దేశంతో రామంతాపూర్ లో కేటీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఏ ముజీబ్ నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండి 14 రోజులుగా ప్రతిరోజు 2000 మందికి రేషన్ కిట్లు మరియు భోజనం పంపిణి చేస్తున్నారు. ఈ మేరకు రామంతాపూర్ ఇందిరా నగర్లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యుల సహకారంతో కేటీఆర్ సేవ సమతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం ఏ ముజీబ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేషన్ కిట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మరియు ఎంఏ అజ్జు హాజరై 250 మంది పేద ప్రజలకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేవ సమితి సభ్యులు శ్రావణ కుమార్, సర్వర్ బాషా, రావు, సుధాకర్, సురం శంకర్ మరియు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అబ్దుల్ సత్తార్, మొహమ్మద్ ఖాసిం, జహంగీర్, రహీమ్ బెగ్, హిదయత్ అలి, మొహమ్మద్ జక్రియా, ఏం. ఏ. మతీన్, కరీం ఖాన్, షేక్ లతీఫ్, సయ్యద్ యూసఫ్, అన్ను, షేక్ ఇబ్రహీం, షేక్ వహీద్, సాడిక్, షకీల్ బెగ్, ముజీబ్ బెగ్, హఫీజ్, అబ్దుల్ రజాక్, మొహమ్మద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు