1 వ వార్డులో కొనసాగుతున్న జ్వరం సర్వే

Published: Monday June 07, 2021
మధిర, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వరం సర్వే కార్యక్రమం మధిర మున్సిపల్ కమీషనర్ ఏ.రమా దేవి గారి నేత్రుత్వంలలొ జిలుగుమాడు 1వ వార్డులో కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాజిటివ్ వచ్చిన వారికి సూచనలు సలహాలు ఇస్తూ అలాగే వారికి పల్స్ రేట్ కూడా చెక్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో వర్ద్ ఇంచార్జి గోపికృష్ణ, ఏ ఎన్ ఎం, అంగన్వాడీ సిబ్బంది సువార్త, ఆశ వర్కర్లు లక్ష్మిదెవి Rp వీణా మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.