తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు ఆత్మీయ సమ్మేళనం

Published: Monday September 19, 2022
జన్నారం, సెప్టెంబర్ 18, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు ఆత్మీయ సమ్మేళనం హైదరాబాదు మల్కాజిగిరి కమిటీ హలులో ఆదివారం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి 33 జిల్లాల నుంచి 500 మంది ముదిరాజ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హజరై హైదరాబాదు మెుదటి మెాయార్ కోర్వికృష్ణ స్వామి ముదిరాజ్ చిత్ర పటానికి జ్యోతి వేలింగి, రాష్ట్రంలోని ప్రింట్, మీడియా టివి న్యూస్ ముదిరాజ్ జర్నలిస్టులు అందరూ  సమ్మేళనంను విజయవంతం చేశారు. ఈ రాష్ట్ర ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండల జర్నలిస్టులైన ఐలవేని నర్సయ్య ముదిరాజ్ ఆదివారం హజారైయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పటు చేయాలని పోలిస్ కృష్ణాన్న కల్చుకోని చనిపోయిన అయనకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా హైదరాబాదు మల్కాజిగిరి ట హలులో, 33 జిల్లాల వారిగా, జిల్లా ముదిరాజ్ జర్నలిస్టు కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యాక్రమంలో రాష్ట్ర ప్రింట్ విలేకరులు, మీడియా సభ్యులు జర్నలిస్టు ముదిరాజులు, టి వి, యుటూబ్ చానెల్స్ జర్నలిస్టు ముదిరాజులు, తదితరులు పాల్గొన్నారు.