రక్తదానం చేయండి మనిషి ప్రాణాలను కాపాడండి

Published: Tuesday July 13, 2021
- బిజెపి నాయకులు యం.రవి కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలోని విద్యానికేతన్ స్కూల్ లో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో  ముఖ్య అతిధులుగా రాష్ట్ర బిజెపి నాయకులు యం.రవి కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల చావు బ్రతుకుల మధ్య  ఉన్న ఒక మనిషిని బ్రతికించుకోవచ్చు, ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి మనిషి ప్రాణాలను కాపాడండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చిట్టా రెడ్డిప్రసాద్, ప్రశాంత్ చారి, భరత్ రాజ్, గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, షైక్ ఫరీద్, శ్రీనివాస్, మాధవా చారి, బాల కుమార్, అరుణ, గాయత్రీ, శేరిలింగంపల్లి బిజెపి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.