త్వరలో డివిజన్ కమిటీల నియామకాలు : సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్ రెడ్డి

Published: Thursday September 23, 2021
అమీర్ పేట్ (ప్రజాపాలన ప్రతినిధి) : సనత్ నగర్ డివిజన్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు డివిజన్ లోని అన్ని విభాగాలతో పాటు కాలనీ, బస్తీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కార్పొరేటర్ కొలను లక్ష్మిబాల్ రెడ్డి  తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె, డివిజన్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ కొలను బాల్ రెడ్డి తో కలిసి సీనియర్ నాయకుల, కార్యకర్తల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాల్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు కమిటీల ఏర్పాటుపై నాయకులు మరియు కార్యకర్తల అభిప్రాయాలు సేకరించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రతి ఒక్కటికూడా ప్రజల చెంతకు వెళ్లేలా కార్యకర్తలే కృషిచేయాలని, జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించాలనే కృతనిశ్చయంతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కమిటీలో పనిచేయడానికి ఉత్సాహవంతమైన నాయకులు తమతమ బయోడేటా అప్లికేషన్ ను కార్పొరేటర్ అఫీస్ లో రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా ఇవ్వవలసిందిగా సూచించారు. ఈ డివిజన్ స్థాయి సమావేశానికి టిఆర్ఎస్ నాయకులు సురేష్ గౌడ్, సరఫ్ సంతోష్, ఖలీల్ బేగ్, సిరాజుద్దీన్, ఫాజిల్ మరియు వార్డు మెంబర్స్, ఆయా కాలనీల ప్రెసిడెంట్స్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.