నూతన విద్యుత్ ట్రాన్స్ఫారంను ప్రారంభించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

Published: Thursday April 28, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ విహరిక సీ సెక్టార్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నూతన విద్యుత్ టన్స్ఫార్మర్ ను స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కొత్త టన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహరిక కాలనీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, కార్యదర్శి రాజు కుమార్నాయక్, సునీల్, చంద్రశేఖర్, రవిందర్ రెడ్డి, రాజేందర్, రామకోటి, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్యామ్ రెడ్డి,నర్సింహారెడ్డి, రవి నాయక్, మంజుల, శోభ, రవీంద్ర చారి, హరిందర్ యాదవ్, ఎలక్ట్రిసిటీ ఏ ఈ రవిందర్, లైన్మెన్ వరుణ్ రెడ్డి, జూలైన్మెన్ సతీష్, కాంట్రాక్టర్ బీరప్ప, జహంగీర్, 25వ డివిజన్ కాలనీల పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.