విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు : అంటూ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్ దుర్గ

Published: Wednesday October 06, 2021
బోనకల్, ప్రజాపాలన ప్రతినిధి, అక్టోబర్ 5 : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ సమస్యల సేకరణలో భాగంగా మంగళవారం బోనకల్ లో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గ భవాని మాట్లాడుతూ విద్యా రంగంలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అన్ని పాఠశాలలకు స్కావెంజర్లను నియమించాలని, గురుకుల పాఠశాలలను ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల విద్యార్థులకు రావలసిన పాఠ్యపుస్తకాలను ఇవ్వాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు టి ఎస్ జి ఎల్ ఐ సౌకర్యం కల్పించాలని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేయాలని గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంభం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షురాలు పి సుశీల, ఉపాధ్యక్షులు ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, బి ప్రీతం, పి గోపాల్ రావు, పివి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.