వ్యవసాయ రుణాలు

Published: Friday October 01, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : గురువారం  భాగ్యనగర్ రైతు సేవ సహకార సంఘం లో క్రాఫ్ లోన్ కొరకు దరఖాస్తు పెట్టుకున్న 8 మంది సభ్యులకు, మొత్తం (4,19,500) 4 లక్షల 19 వేల 500 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగిందినీ పేర్కొన్నారు. ది భాగ్యనగర్ సహకార సొసైటీ బ్యాంక్ ఛైర్మన్ మర్రి నర్సింహ రెడ్డి, బ్యాంక్ డీసీసీబీ మేనేజర్,  భాగ్యనగర్ సీఈవో శిరీష, బిఎఫ్యాక్స్ అసిస్టెంట్ మేనేజర్ సువర్ణ తో కలిసి సభ్యుడు మర్రి తిరుపతి రెడ్డి కి చెక్ అందజేశారు. క్రాఫ్ లోన్ పొందిన సభ్యులు 1.మర్రి తిరుపతి రెడ్డి, 2.రాళ్లగూడెం మల్లా రెడ్డి, 3.బొక్క జమున, 4.తర్రె అంజయ్య యాదవ్, 5.తర్రె రవి యాదవ్, 6.మర్రి శ్రీధర్ రెడ్డి, 7.గడ్డం శ్రీకాంత్ రెడ్డి, 8.పొలంగారి అంజి రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.