75 మీటర్ల జాతీయ జెండాతో పట్నం పురవీధుల్లో యువసంకల్ప యాత్ర

Published: Monday August 16, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 15, ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ బాల గోవర్ధన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల శ్రీశైలం, ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మహేందర్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 మీటర్ల జాతీయ జెండాను వంద మందికి పైగా యువ నాయకులతో యువ సంకల్ప యాత్ర ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం వీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు పోరెడ్డి అర్జున్ రెడ్డి, వనపర్తి జిల్లా బిజెపి ఇంచార్జ్ బోసుపల్లి ప్రతాప్, ముత్యాల భాస్కర్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, బిజెపి మండలాధ్యక్షుడు దండం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జాతీయ పిలుపుమేరకు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 మీటర్ల జాతీయ జెండాను నాయకులతో ఐదు కిలోమీటర్ల యాత్ర కొనసాగింది దేశ జనాభా కోసం దేశ ప్రతిష్ట ప్రచారానికి చెప్పే విధంగా ఈ యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి మాదగోని శేఖర్, లింగం, శ్రీకాంత్, మహేష్ చారి,  రాజు, శివ గౌడ్, నరసింహారెడ్డి , శ్యాం ప్రసాద్ రెడ్డి, తులసి తదితరులు పాల్గొన్నారు.