పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో త్రివేణి స్కూల్ ప్రభంజనం

Published: Friday July 01, 2022

భద్రాద్రి కొత్తగూడెం(ప్రజాపాలన బ్యూరో)భద్రాచలం పట్టణంలోని తెలంగాణ గవర్నమెంట్ గురువారం  ప్రకటించినటువంటి పదవతరగతి పరీక్ష ఫలితాలలో త్రివేణి పాఠశాల ప్రభంజనాన్ని సృష్టించింది 87 మంది విద్యార్థులకు 87 మంది 100% పాస్ అయ్యారు.వీరిలో 10 GPA -6, 9.8 GPA -7, 9.7 GPA-8 9.5 GPA- 6,9.3 GPA-8,9.2 GPA-4,9 GPA-9 మరియు 8 జి పి ఏ తో 24 మంది పాసయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జంగాల మంజుల మాట్లాడుతూ మా స్కూల్నందు గత పది సంవత్సరముల నుండి ఇదే విధంగా అత్యున్నత స్థాయి ఫలితాలను సాధిస్తూ విద్యార్థినీ,విద్యార్థులు,వారి తల్లిదండ్రుల,సహకారంతో ఈ యొక్క విజయాన్ని సాధించామని అన్నారు.విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లితండ్రులను పిలిపించి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జంగాల మంజుల,ఏ ఓ.బాబురావు ,వైస్ ప్రిన్సిపాల్ కానుమిల్లి విమలాదేవి ,అకాడమిక్ ఇంచార్జ్ నరేష్,క్యాంపస్ ఇంచార్జ్ సందీప్ రెడ్డి, బోధన బోధ నేతర సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థినీ విద్యార్థులను నీ అభినందించారు.