మాదారం గ్రామంలో కరోనా వైద్య పరీక్షలు

Published: Monday May 17, 2021
సంగారెడ్డి, మే 16, ప్రజాపాలన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామంలో కరోనా వ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండండతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం జిన్నారం ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బంది మాదారం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు క్యాంప్ చేపట్టారు. పరీక్షలు నిర్వహించారు, గ్రామానికి చెందిన ముగ్గురికి  కరోనా నిర్ధారణ కాగా, స్వల్ప లక్షణాలు గల రోగులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ క్యాంపు మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.