శ్రీకృష్ణ స్వామి ఆలయానికి 50 సిమెంట్ బస్తాలను విరాళంగా ఇచ్చిన కార్పొరేటర్

Published: Wednesday October 27, 2021
బాలాపూర్:అక్టోబర్26, ప్రజాపాలన (ప్రతినిధి) : బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ అల్మాస్గూడ గ్రామం మూడో డివిజన్ లో నూతనంగా నిర్మించే శ్రీకృష్ణ దేవాలయానికి స్థానిక 2వ డివిజన్ కార్పొరేటర్ జెనగ పద్మ ఐలయ్య సొంత డబ్బులతో మంగళవారం 50 బస్తాల సిమెంట్ ను విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గతంలో ఆలయ కమిటీ సభ్యులకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో మనసుకు తృప్తిగా ఉందని, ఆ స్వామి (శ్రీకృష్ణుడు) చల్లని చూపుతో డివిజన్ ప్రజలందరికి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో  ఉండాలని కోరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.