రామ్ లీలా కార్యక్రమానికి లక్ష రూపాయల విరాళాన్ని అందించిన మాజీ ఎంపీ వివేక్
Published: Tuesday October 04, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 5వ తేదీన పట్టణంలోని తిలక్ స్టేడియంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామ్ లీలా కార్యక్రమానికి అధిక సంఖ్యలో విరాళాలు అందుతున్నాయని, ఇందులో భాగంగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి లక్ష రూపాయల విరాళాన్ని అందించినట్లు హిందూ ఉత్సవ సమితి ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Share this on your social network: