బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులుగా ముడావత్ సైదా నియామకం

Published: Friday December 23, 2022

బోనకల్, డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆదేశాల మేరకు బోనకల్ మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులుగా ముడావత్ సైదాను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. బి ఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సూచన తో రావినూతల గ్రామానికి చెందిన ముడావత్ సైదా ను మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా అధ్యక్షులు సైదా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకెళ్తానని, అందరిని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నా నియామకానికి కృషిచేసిన నా మీద నమ్మకంతో బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షులుగా నియమించినందుకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, టిఆర్ఎస్ బోనకల్ మండల కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.