*విద్యరుల జీవితాలతో చెలగాటం, ఆడుతున్న వారిని, పీడి యాక్టు విధించి, జైల్లో పెట్టాలి* *ఎస్ ఎఫ్ ఐ.

Published: Tuesday April 04, 2023

చేవెళ్ల ఏప్రిల్ 3, (ప్రజాపాలన):-

వికారాబాద్ జిల్లా విద్యాధికారి నీ వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ అన్నారు.
సోమవారం తాండూరులో లీకైన పదవ తరగతి ప్రశ్నాపత్రం బాధ్యులను వెంటనే సస్పెండ్ చేసి జైలుకు పంపించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మొన్న గ్రూప్స్ పేపర్ నేడు టెన్త్ పరీక్షల పేపర్ లీక్ ఎల్లుండి ఇంకా ఎన్నో ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని,ఇది మంచిది కాదని పేద విద్యార్థులు కష్టపడి చదువుతుంటే కొంతమంది ప్రభుత్వాధికారులు కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ పేపర్ లీకులకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై పీడి యాక్ట్ నమోదు చేయాలని అన్నారు.అదేవిధంగా పేపర్ లీక్ కు పూర్తి బాధ్యత వహిస్తూ వికారాబాద్ జిల్లా డీఈవో గారు వెంటనే రాజీనామా చేయాలని లేకుంటే కలెక్టర్ గారు వెంటనే ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట నిర్వహిస్తామని హెచ్చరించారు.