ట్రంక్ లైన్ నిర్మాణ పనులలో ప్రత్యేక శ్రద్ధ పై కలెక్టర్ కు వినతి

Published: Wednesday March 03, 2021

బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; మీర్ పేట కార్పొరేషన్ లోని 37 వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులు, ట్రంక్ లైన్, అదేవిధంగా చెరువులు సుందరీకరణ లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37 డివిజన్ కార్పొరేటర్ మోడల్ బాలకృష్ణ, 34 వ డివిజన్ కార్పొరేటర్ మన్నెమ్మ  తనయుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రెండు డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతూ లేవునీ? డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చెరువులు సుందరీకరణ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇక్కడున్నా నేతలు పట్టించుకోవడంలేదని మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు బిజెపి కార్పొరేటర్లు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ. గతంలో భారీ వర్షాల వల్ల వివిధ కాలనీలు పూర్తిగా నీట మునిగి పోయినందున  నెల రోజులు కాలనీవాసుల 10 కోట్లు నష్టం కలిగింది అన్నారు. నీటమునిగిన ఇంటికి పదివేల రూపాయలు, సగం ఇల్లు పడిపోయిన వారికి 50,000 రూపాయలు, ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి  లక్ష రూపాయలు అన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ, డ్రైనేజీ పనులు, రోడ్డు పనులు,23 కోట్ల ట్రంక్ లైన్  పనులు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కూడా నత్తనడక నడుస్తున్నాయి అని అన్నారు. చేసే పనులు కూడా నాణ్యత లేవని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలినీ, అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక ఉండేటట్లు చూడాలని, అదేవిధంగా సంధ చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు సుందరీకరణ భాగంగా తొందరలో పనులు పూర్తి కావాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గాజుల మధు, బీ. నరసింహ్మ, తదితరులు పాల్గొన్నారు.