సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు

Published: Monday November 01, 2021
మేడిపల్లి, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి) ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్లు, నాయకులు, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేసినారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె.శ్రీనివాస్, కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కౌడే పోచయ్య, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పప్పుల అంజి రెడ్డి, బండారు రవీందర్, చెరుకు పెంటయ్య, జావిద్ ఖాన్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.