భోజన ప్రియులకు రుచికరమైన ఆహారం అందించాలి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Tuesday October 11, 2022
మేడిపల్లి, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి)
 భోజన ప్రియులకు రుచికరమైన ,నాణ్యమైన ఆహారాన్ని అందించి వారి మన్ననలను పొందాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రెస్టారెంట్ నిర్వాహకులకు సూచించారు.  
రామంతాపూర్ మెయిన్ రోడ్ శుభం గార్డెన్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ మార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి,        సినీ హీరోయిన్ హెబ్బా పటేల్, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి పాల్గొని రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు రామన్న మురళి, రాజిరెడ్డి, అర్జున్ గౌడ్ ,ప్రశాంత్ వారి భాగస్వాములు కుటుంబ సభ్యులు అంబర్ పేట శంకర్, హబ్సిగూడ డివిజన్ బిజెపి అధ్యక్షులు కక్కిరేణి హరీష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, ఎండి ముస్తాక్, దాచేపల్లి శ్రీధర్,బోసాని పవన్, సురం శంకర్ ప్రజలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area