సీఎం సహాయనిధి పేదలకు వరం

Published: Friday May 27, 2022
లాంటిది
ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
మేడిపల్లి, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి)
పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.హబ్సిగూడ
డివిజన్ కామాక్షి పురంకు చెందిన షేక్ సమీర్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 1 లక్ష  సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీ పత్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి ,వనం పల్లి గోపాల్ రెడ్డి, హబ్సిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బి .వి .చారి, ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి, నాచారం డివిజన్ ప్రెసిడెంట్ మేకల ముత్యం రెడ్డి, అబ్బు బాయ్ తదితరులు పాల్గొన్నారు.