రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday December 20, 2022
మేడిపల్లి, డిసెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపూర్ వరకు సుమారు రూ 26.32 కోట్లతో నిర్మితమవుతున్న 4 లైన్ల రోడ్డు విస్తరణ,నిర్మాణ పనులను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమీషనర్ డా. పి రామకృష్ణ రావు, హెచ్ఎండిఏ అధికారులు కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి కావాలని మేయర్ అధికారులను ఆదేశించారు.ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేసి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాల్సిందిగా పేర్కొన్నారు. మిషన్ భగీరధ ఫేస్-2లో భాగంగా నిర్మిస్తున్న మంచి నీటి పైప్ లైన్ పనులను మేయర్ వెంకట్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, స్తంబాలు,ట్రాన్సుఫార్మర్లు ఎన్ని రోడ్లకు అడ్డంగా వస్తున్నాయో వాటి వివరాలు సేకరించి ఎక్కడైతే స్తంబాలు,ట్రాన్సుఫార్మర్లను షిప్టు చేయాల్సి ఉందో వెంటనే షిప్టు చేయాలని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎత్తు ఎక్కువగా ఉండే విద్యుత్ స్తంబాలు,బంచ్ కేబుల్స్ వేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సమస్యల పరిష్కరంలో నిర్లక్ష్యం చేయొద్దని మేయర్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్లు కౌడే పోచయ్య,మద్ది యుగేందర్ రెడ్డి,బచ్చ రాజు,దొంతిరి హరిశంకర్ రెడ్డి, ఏంపల్ల అనంత రెడ్డి, కొల్తూరి మహేష్,సుభాష్ నాయక్, నాయకులు మాడుగుల చంద్రారెడ్డి,దేవేందర్ గౌడ్,కుర్ర శ్రీకాంత్ గౌడ్,పప్పుల అంజిరెడ్డి, అలవాల దేవేందర్ గౌడ్,యాసారం మహేష్,జావీద్ ఖాన్, ఇంజనీర్లు,విద్యుత్ కాంట్రాక్టర్లు చంద్ర శేఖర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, విద్యుత్ అధికారులు,రెవిన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.