కార్పొరేషన్ అటెండర్ లక్ష్మణ్ పార్థివదేహానికి నివాళులర్పించిన బిజెపి నేతలు

Published: Wednesday July 28, 2021
బాలాపూర్: జులై 27 ప్రజాపాలన ప్రతినిధి : బడంగ్ పేట కార్పొరేషన్ లో పనిచేస్తున్న అటెండర్ పుట్టగళ్ల లక్ష్మణ్ పార్థీవదేహానికి నివాళులర్పించిన బిజెపి కార్యకర్తలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అటెండర్ పుట్టగోళ్ల లక్ష్మణ్ నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. లక్ష్మణ్ పార్థివదేహానికి బిజెపి కార్యకర్తలతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ రాములు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... లక్ష్మణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి... వారికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు. బడంగ్ పేట కార్పొరేషన్ ప్రజలకు ఎన్నో సేవలు అందించిన లక్ష్మణ్ మన మధ్య లేకపోవడం బాధాకరమని అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. లక్ష్మణ్ మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర నాయకులు నడికుడి యాదగిరి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు చిత్రం శ్రీను, కార్పొరేటర్లు అనితా ప్రభాకర్, గౌర రమాదేవి శ్రీనివాస్, జీఎస్ దొడ్డి మల్లికార్జున్, బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగుడెం రామకృష్ణారెడ్డి, జనిగె వినయ్, సురేష్, ఈశ్వర్, భువనచంద్ర, పవన్ సహా బీజేపీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు.