క్రీడాకారులకు సామాగ్రి అందజేసిన వార్డు సభ్యులు

Published: Tuesday April 26, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేది 25 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలోని వాలిబాల్ క్రీడాకారులకు స్థానిక అనుబంధ గ్రామం జాజొనిబావికి చెందిన వార్డ్ సభ్యులు వల్లపు మల్లమ్మ-నర్సింహ సొంత ఖర్చూలతో వాలిబాల్ ఆట వస్తువులను గూడెం శ్రీనివాస్ చేతుల మీదుగా ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా గూడెం శ్రీనివాస్ మాట్లాడుతూ.... గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా సామగ్రిని అందించినట్లు తెలిపారు. యువత మంచి క్రీడా స్పూర్తితో పలు పోటీల్లో పాల్గొని రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా వార్డ్ సభ్యులు వల్లపు మల్లమ్మ నర్సింహకు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు.