మొక్కలు నాటిన వైద్యురాలు

Published: Monday February 22, 2021

ప్రజాపాలన - క్యాతన్ పల్లి : పురపాలక సంఘం రామకృష్ణాపూర్ పట్టణంలో మంచిర్యాలకు చెందిన వైద్యురాలు శృతి గోలి తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఆదివారం వైద్యురాలు మాట్లాడుతూ పరిసరాల సమతుల్యతకు, కాలుష్యం నివారణకు నాటిన మొక్కలు ఎంతగానో ఉ పయోగపడతాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరు జన్మదిన, వివాహ ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలు నాటి ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి మొక్కలు నాటి వృక్ష సంపదను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోలి కృష్ణ, చైతన్య, గోలి తిరుపతి న్యాయవాది, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.