సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ --ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

Published: Monday August 29, 2022

జగిత్యాల, ఆగస్టు 28 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ 6, 7, 8, 9 వార్డుల లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన 191 ఆసరా పెన్షన్ కార్డ్ లను పట్టణ వికెబి  ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు అందజేసి అనంతరం వార్డులకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, 13 మంది ఆడబిడ్డలకు 13 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి  చెక్కులను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అందజేసినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ అని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కమిషనర్ స్వరూప రాణి, జిల్లా కౌన్సిలర్ ఫోరం అధ్యక్షులు పంబాల రామ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ లు కోలగాని ప్రేమలత సత్యం, రేణుక మొగిలి, మళ్లవ్వ తిరుమలయ్య, శ్రీలత రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, రామాలయం ఛైర్మెన్ నరేష్, నాయకులు సమిండ్లశ్రీనివాస్, జేడి, అరుముల్ల పవన్, లచ్చన్న, నీలి ప్రతాప్, మాజీ కౌన్సిలర్ భూమా గౌడ్, ఆవారి గంగాధర్, కార్మిక విభాగం శెట్టి శ్రీనివాస్, కూతురు శేకర్, రాష్ట్ర కౌన్సిలర్ ఫోరం ఉప అధ్యక్షులు బోడ్ల జగదీష్, కౌన్సిలర్ లు కుసరి అనిల్, అవారి శివ కేసరి బాబు, పిట్ట ధర్మరాజు, కూతురు రాజేష్, కోరే గంగ మల్లు, చుక్క నవీన్, తోట మల్లికార్జున్, కో ఆప్షన్ లు శ్రీనివాస్, వజ్రమ్మ అంజా గౌడ్, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.