సాయిబాబా గుడి దగ్గర అ కాలవలో మురికి నీరు నిల్వ ఉన్న పట్టించుకోని వైనం

Published: Monday September 13, 2021
మధిర, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపల్ కమిషనర్ గారికి 4 రోజుల క్రితం తెలిపిన పట్టించుకోవట్లేదని అంటున్న ప్రజలు సిపిఎస్ స్కూల్ సాయిబాబా గుడి దగ్గర కాలవ కట్టినారు కాని ఆ కాల్వను వర్తక సంఘం మీదుగా కలపాల్సి ఉండగా ఇంతవరకు కలపక పోవటం వల్ల ఆ నీరు ఇక్కడ  స్టాక్ అవటంవల్ల ఆ మురికి నీరు వాసన భరించలేక అక్కడున్న ప్రజలు, విద్యార్థులు, బాటసారులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సాయిబాబా గుడి దగ్గరప్రజలు వస్తూపోతూ ఉంటారు కనీసంగా మున్సిపాలిటీ సిబ్బంది ఇప్పటికైనా స్పందించి ఆ కాలవ బాగు చేపించవలసిందిగా కోరుతున్న విద్యార్థులు, ప్రజలు. ఇది ఇలాగే ఉంటే డెంగు, మలేరియా, టైఫాయిడ్ అనేక రోగాలకు నిలయంగా మారుతుంది అంటున్న ప్రజలు...