మహాలక్ష్మి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు
Published: Monday November 07, 2022
జన్నారం, నవంబర్ 06, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని
మహాలక్ష్మి ఆలయ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో వేద పండితులచే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి అలయంలో ప్రథమ వర్షికోత్సవం పురస్కారించుకోని అలయంలో పుణ్యావాచనం,
గణపతి ,గౌరి పూజ,
నవగ్రహపూజ
అభిషేకం, అలంకరణ
కుంకుమార్చన, లక్మి గణపతి హవనం, పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పము, ఆశీర్వచనం, వేధ పండితులు భక్తులలతో పూజలు జరిపించారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఘండి నరహరి శర్మ, ఘండి గణేష్ శర్మ, ధర్మపురి వాస్తవ్యులు పెండ్యాల రాకేష్ శర్మ, నారంభట్ల ప్రశాంత్ శర్మ, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: