గ్రామంలో నివారణ చర్యలను పరిశీలించిన ఎంపీడీవో

Published: Thursday May 06, 2021
బీరుపూర్, మే 05 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం నర్సింహులపల్లి గ్రామంలో ఎంపిడిఓ పుల్లయ్య పర్యటించి కోవిడ్ -19 సోకిన వారికి దైర్యం చెప్పి సమయానికి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య సలహాలను సూచించారు. కరోనా సోకిన వారి ఇంట్లో మిగత కుటుంబ సభ్యులు టెస్టులు చేసుకోవాలని హోం ఐసోలేషనులో ఉండాలని ప్రజలు మస్కులు ధరించి అవసరం ఉంటేనే బయటకు రావాలని తెలిపారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న కరోనా నివారణ చర్యలను పరిశీలించి గ్రామ పంచాయతీ నర్సరీనీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రిక్కల ప్రభాకర్ పంచాయతి సెక్రటరీ రాజ్ కుమార్ అంగన్వాడి కార్యకర్తలు ఏపీవో రాజేందర్ టిఏలు తదితరులు పాల్గోన్నారు.