ఈ నెల 3న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లోకేష్ కార్మికులతో కలిసి పో

Published: Tuesday August 02, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 01(ప్రజాపాలన, ప్రతినిధి) : ఈ నెల 3న సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ ను జయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్, జిల్లా కార్యదర్శి రాజేందర్ లు పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో సభకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలనిఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నుండి దారి మళ్లించిన ఇప్పుడు తిరిగి వెల్ఫేర్ బోర్డు లో జమ చేయాలని, 60 సం, పైబడిన కార్మికులకు పెన్షన్ 5 వేలు ఇవ్వాలని, డిమాండ్ చేస్తున్నామన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన ముడి సరుకుల ధరలు తగ్గించాలి, నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి, స్థలం ఉన్న వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులు, హమాలి, ఆటో, ఫోర్ వీలర్ డ్రైవర్, ఇతర రంగాల కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు కమలాకర్ మేస్త్రి, రవి, సదయ్య,తిరుపతి, బాలాజీ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.