రూ18 లక్షలతో ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించిన ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday April 10, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)

 చిలకానగర్ డివిజన్లోని బాలాజీ ఎన్క్లేవ్ పార్క్ లో ఓపెన్ జిమ్ దాదాపు రూ18 లక్షల వ్యయంతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని స్థానిక కార్పొరేటర్  బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గరిక సుధాకర్,బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, వేముల సంతోష్ రెడ్డి, చిలకానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లే నరసింగరావు, ప్రధాన కార్యదర్శి కొక్కండ జగన్, నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి, కొంపల్లి రవీందర్, అబ్బు బాయ్ మహబూబ్ బింగి శ్రీను, తిరుమలేష్, రాం చందర్, స్థానిక కాలనీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ఓంకార్ సింగ్, వెంకటేశ్వర్లు , జగదీశ్వర్ రెడ్డి, సిద్దేశ్వర రావు లక్ష్మీనారాయణ, సారయ్య ,కెవిన్, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.