మృతుల కుటుంబాలను పరమార్శించిన సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు.

Published: Friday November 26, 2021

కొడిమ్యాల, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త చిలువేరి వెంకట సాయి (24) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ ఢీ కొనడంతో కరీంనగర్ లోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తుండగానే గురువారం తెల్లవారుజామున మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులను గురువారం రోజున సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు పరమార్శించి, మృతికి గల కారణాలను తెలుసుకొని వారి దయనీయ పరిస్థితిని గమనించి దహన సంస్కారాల కొరకు 2500రూ.ల ఆర్థిక సహాయం చేసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టి కి తీసుకెళ్ళి పార్టీ పరంగా ఆకుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. అలాగే కొడిమ్యాల గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు కొండ కృష్ణవేణి వాళ్ల అమ్మమ్మ, మరియు మ్యాక జనార్దన్ వాళ్ల భార్య మ్యాక సరోజన అనారోగ్యంతో గత పది రోజుల క్రితంమృతి చెందగా కృష్ణవేణి కుటుంబసభ్యులను, మరియు జనార్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వారితో స్థానిక సర్పంచ్ పెద్ది కవిత రవి, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, కొండగట్టు దేవస్థాన డైరెక్టర్ వొల్లాల లింగ గౌడ్, కొడిమ్యాల పట్టణ తెరా‌స అధ్యక్షులు కొత్తూరి స్వామి, తెరాస యూత్ మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, కొడిమ్యాల వార్డు సభ్యులు, కాముని శ్రీనివాస్ దీకొండ చంద్రశేఖర్, మొగిలి రాకేష్ నాయకులు ఈదూరి అబ్రహం, రమేష్ గౌడ్, బైరి వెంకటి, కాయిత రాజు, శేఖర్, అనుమాండ్ల అజయ్ రెడ్డి, సతీష్ రావు, నరేష్, చిటాలపెల్లి నర్సయ్య గ్రామస్తులు ఉన్నారు.