ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి *విద్యారంగ సమస్యల పోరాటంలో మడమతిప్పని ఎస్

Published: Saturday December 31, 2022

విద్యారంగ సమస్యల పరిష్కార పోరాటంలో ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘం ఏనాడు మడమతిప్పని పోరాటాలు చేసిందని ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు ఏర్పుల తరంగ్ అన్నారు. బుధవారం ఎస్ఎఫ్ఐ 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తరంగ్ ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 1970 డిసెంబర్ 28 నుండి 30వ తేదీల్లో కేరళ రాష్ట్రం తిరువనంతపురం ప్రాంతంలో అధ్యయనం-పోరాటం అనే నినాదంతో స్వాతంత్య్రం, ప్రజా స్వామ్యం, సోషలిజం అనే లక్ష్యాలతో 11 మంది సభ్యులతో ఏర్పడి 53 సంవత్సరాలు వచ్చినప్పటికీ విద్యార్థుల పక్షాన విద్యార్థి న్యాయం కోసం పోరాటం చేస్తుందన్నారు. చాలా మంది విద్యార్థి నాయకులని కోల్పోయినప్పటికీ, నిర్బంధాలు ఎదుర్కొంటూ, ప్రభుత్వాలు దాడులు చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా నిత్యం విద్యార్థుల పక్షాన ఉంటూ అనేక రూపాల్లో భవిష్యత్తులో విద్యారంగం కోసం పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. మా దేహాలు ముక్కలైన కానీ, ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం, అనే నినాదంతో ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు మీసాల స్టాలిన్, బోడ వంశీ, వినోద్,వినయ్, మధు, లక్ష్మణ్, వర్షిత్, పృధ్వి సింహ, విద్యార్థులు పాల్గొన్నారు.