తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా ఆటో వాళ్లకు ఇవ్వండి

Published: Monday May 03, 2021
- కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో నూతన స్వచ్ఛ ఆటో ను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో చెత్త ఎత్తడానికి జిహెచ్ఎంసి స్వచ్ఛ ఆటోను నూతనంగా కేటాయించడం జరిగింది. కొత్తగా వచ్చిన స్వచ్ఛ ఆటోను ఆదివారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఆటో వాళ్లకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే కరోన పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు భౌతిక దూరం పాటించాలని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది, కాలనీ వాసులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.