కరోనా కట్టడికి ఇంటింటికి పిచికారి

Published: Wednesday May 12, 2021
బాలపూర్, మే 11, ప్రజాపాలన ప్రతినిధి : తెరాస ఇన్చార్జి వంటేరు నరసింహారెడ్డి కాలనీ వాసులకు ధైర్యం తో పాటు జాగ్రత్తలు చెప్పారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 20వ డివిజన్ లో తెరాస ఇంచార్జి వంటేరు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారంనాడు గాయత్రి నగర్ లో ఇంటింటికి హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని (స్ప్రే) పిచికారి చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశానుసారం గా కాలనీవాసులు సురక్షితంగా ఉండాలని ఉద్దేశంతో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సందర్భంలో కాలనీ వాసులకు ధైర్యంతో పాటు కరోనా ను తరిమి కొట్టాలని, అదే విధంగా కాలనీవాసులు అందరికీ జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు బాలప్ప, బండి నాగేష్, సుదర్శన్ రెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, కాలని అధ్యక్షులు ఆంజనేయులు, నరసింహస్వామి  టెంపుల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.