అసెంబ్లీలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్కకి ఆర్యవైశ్య సంఘాలు కృతజ్ఞతలు

Published: Thursday October 07, 2021
మధిర, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : ఎన్నో ఏళ్లుగా హామీలకు మాత్రమే పరిమితమై ఆచరణకి నోచుకోకుండా నిలిచిపోయిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆచరణలోకి తీసుకురావాలని కోరుతూ మంగళవారం సీఎల్పీ లీడర్ మధిర ఎమ్మెల్యే  మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం పట్ల మధిర ఆర్య వైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల మధిరకు వచ్చిన సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కను మధిర ఆర్యవైశ్య కార్పొరేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా దీని గురించి ఆర్యవైశ్యుల అభ్యర్థనను మన్నించి ఇచ్చిన మాట మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మల్లు భట్టి విక్రమార్కకి ఆర్యవైశ్య కార్పొరేషన్ పోరాట కమిటీ మరియు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆర్యవైశ్య ప్రముఖులు ఇరుకుల్ల లక్ష్మీ నరసింహారావు, రంగా వెంకటేశ్వరరావు, మిరియాల రమణ గుప్తా, రంగా అప్పారావు, కోన ధని కుమార్, పల్లపాతు ప్రసాదరావు, కురువెళ్ల కృష్ణ, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, కుంచం కృష్ణారావు, ఇరుకుళ్ళ సురేష్, చల్లా సత్యనారాయణ, డోకుపర్తి సత్యంబాబు, దేవిశెట్టి రంగారావు, వేముల తిరుపతిరావు, పుల్ల ఖండం చంద్రశేఖర్, చారుగుండ్ల నరసింహమూర్తి, వేముల నవీన్ నాళ్ళ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.