ఐదు కిలోమీటర్ల పరుగు పందాన్ని ప్రారంభించి పాల్గొన్న ఎమ్మెల్యే

Published: Monday December 20, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి స్పోర్ట్స్ క్లబ్ మరియు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నెంబర్ టూ గ్రౌండ్లో సంయుక్తంగా నిర్వహించిన ఐదు కిలోమీటర్ల పరుగు పందాన్ని ప్రారంభించారు. 5కె రన్ లో పాల్గొన్న అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిగెత్తి వారిలో హుషారు నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకైన పాత్ర పోషించాలని బెల్లంపల్లి నియోజకవర్గం నుండి క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తాను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మునిసిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, భీమా గౌడ్, సిద్దంశెట్టి సాజన్, రెవెల్లి విజయ్, పుల్లూరి మోహన్, అరెపల్లి వంశీ, ఈటె రాకేష్ తదితరులు పాల్గొన్నారు.