మతిస్థిమితం లేక బావిలో పడి గర్భిణీ మృతి.

Published: Tuesday November 15, 2022

జన్నారం, నవంబర్ 14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మన్నెగూడ గ్రామంలో మతిస్థిమితం లేక బావిలో పడి ఏడు నెలల గర్భిణీ  మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.  అదనపు ఎస్ఐ తానాజీ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, జన్నారం మండలంలోని మన్నెగూడ  గ్రామానికి చెందిన మెరుగు కళ అనే గర్భిణి (32) గత రెండు సంవత్సరాలుగా   మతిస్థిమితం లేక ఆదివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించారు. సోమవారం తెల్లవారుజామున చూసేసరికి ఆమె ఇంట్లోకి లేకపోవడంతో ఆమె భర్త భూమయ్య గ్రామ శివారులో తిరుగుతుండగా వ్యవసాయ బావిలో పడి మృతి చెందిందని, భర్త భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మృతురాలు మెరుగు కళ కు మొదటి కాన్పుగా మగ బిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి గా ఉందని వార తెలిపారు.