కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసం

Published: Monday July 25, 2022

జగిత్యాల, జులై 24 ( ప్రజాపాలన ప్రతినిధి): టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని  జగిత్యాల ప్రధాన ఆసుపత్రి లో శ్రీ సత్య సాయి నిత్య అన్నదాన ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం  జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్  నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, టిఆర్ఎస్  పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జిల్లా కౌన్సిలర్ల ఫోరం అద్యక్షులు పంబాలరాము, నాయకులు, కార్యకర్తలు  మరియు సత్యసాయి ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.