యోగా ద్వారానే ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తుంది

Published: Tuesday June 22, 2021
మల్లాపూర్, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : యోగా ద్వారానే ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తుందని సిరిపూర్ గ్రామ సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి రాజా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి పనులకు వచ్చేవారితో పాటుగా గ్రామ ప్రజలు రోజూ కనీసం అరగంట యోగా చేయడానికి సమయం కేటయించుకోవాలని యోగా ద్వారా ఆరోగ్యంగా ఉంటారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు దేవ మల్లయ్య, ఇంచార్జి ఎంపీఓ మహేష్‌, ఎంపీటీసీ సభ్యులు ఏనుగురాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రంజిత్‌ కుమార్‌, వార్డు సభ్యులు కిషోర్‌, నాగార్జున, రాజునాయక్‌, మహేష్‌, శృతి - రాజశేఖర్‌, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, వివోఏలు, మహిళాలు తదితరులు పాల్గొన్నారు.