ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలి- రసమయి శంకరపట్నం నవంబరు 24 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Friday November 25, 2022

శంకరపట్నం మండల కేంద్రంలో ఈరోజు రసమయి బాలకిషన్ విస్తృతంగా పర్యటించి, లబ్దిదారులకు కళ్యాణాలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు
కేశవపట్నం లోని ఖబరస్థాన్ల ప్రహారీ గోడ నిర్మాణాలకు శంఖుస్థాన చేశారు. అనంతరం జరిగిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరయ్యారు
ఈ సంధర్బంగా కాంగ్రేస్ పార్టీ నుండి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే రసమయి గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రసమయి  మాట్లాడుతు....డిసెంబర్ 01న మండల కేంద్రం లో నిర్వహించబోయె టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన నికి అన్నీ గ్రామాలనుంచీ ప్రజలు టీఆర్ ఎస్ కార్యకర్తలు అదిక సంఖ్యలో హాజరు  కావాలనీ ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమమోలో జెడ్ పి టి సి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ మండల శాఖ అద్యక్షుడు గంట మహిపాల్ తధితరులు పాల్గొన్నారు