మొక్కలను పంపిణీ చేసిన కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్

Published: Monday September 06, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని బోడుప్పల్ కార్పొరేషన్ 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రామా వెంకటేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేటర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్, గణేష్ నగర్, బయ్యన్న నగర్, అమూల్య దివ్య నగర్ పలు కాలనీలలో పర్యటిస్తూ ఇంటింటికి తిరుగుతూ 6 మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ హరితహార కార్యక్రమంలో ప్రజలు వద్ద నుంచి మంచి స్పందన లభిస్తోందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, భావితరాలకు ఆస్తులకు బదులుగా మంచి ఆక్సిజన్ అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.