చైల్డ్ ఫండ్ ఇండియా ఎన్జీవో ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం
Published: Wednesday October 19, 2022
బోనకల్, అక్టోబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ నందు సర్పంచ్ భూక్యా సైదా నాయక్ సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా ఎన్జీవో వారి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు ఎయిడ్స్ (హెచ్ఐవి) సుఖ వ్యాధులపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవి తో జీవిస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఆసరా పింఛన్లు కూడా వస్తాయని తెలియజేయడం జరిగింది. యూత్ తొందరపాటు వలన అలంగిక సంపర్కం ద్వారా హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సూపర్వైజర్ నిరోషా, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, ఆశా కార్యకర్తలు లీలా కుమారి, దుర్గ, గద్దె తులసి, లింక్ వర్కర్ వెంకటేశ్వర్లు, వాలంటీర్ నాగరాజు, రామకృష్ణ, శివాజీ, దుర్గా ప్రసాద్ ,గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: